పెట్రోలు బంకులో బాంబు ఉన్నట్లు ఫోన్‌

రంగారెడ్డి : రాజేంద్రనగర్‌ మండలం శివరాంపల్లిలో పెట్రోల్‌ బంకుల్లో  బాంబులు ఉన్నట్లు ఆగంతుకుడి నుంచి ఫోన్‌ కాల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ పెట్రోలు బంకులను మూసివేసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.