పెద్దకొత్తపల్లి మండలం లో బిజెవైయం బైక్ ర్యాలీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు 14(జనంసాక్షి):

ఆజాదీకా అమృతోత్సవ్ లో భాగంగా దేశ ప్రధాని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని పిలుపునివ్వడం జరిగింది.దానిలో భాగంగా భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు పాల్గొని మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు మనం నిర్వహించు కుంటున్న 75 సంవత్సరాల స్వాతంత్ర సంబరాలలో ప్రతి ఇంటికి తెలిసే విధంగా మన దేశ చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా ప్రతి కుటుంబం దేశభక్తిని కలిగి ఉండే విధంగా అవగాహన కల్పించడం కొరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియ జేశారు.దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఎందరో త్యాగదనుల గురించి యువత తెలుసుకొవాలని మనం దేశభక్తిని కలిగి ఉండి దేశం పట్ల, మన సంస్కృతి పట్ల గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా అధ్యయనం చేయాలని పిలుపునివ్వడం జరిగింది.బైక్ ర్యాలీ పెద్దకొత్తపల్లి మండల బిజెపి అధ్యక్షులు పధిర భీమేష్, యువమోర్చా మండల అధ్యక్షులు అమ్మపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో తిరుమలాపూర్ గ్రామం నుండి బయలుదేరి పెద్దకొత్తపల్లి, సాతాపూర్, చెన్నపు రావు పల్లి,కల్వకోల్ మీదుగా కొల్లాపూర్ పట్టణం వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి జలాల్ శివుడు, యువమోర్చా జిల్లా అధ్యక్షులు భరత్ చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు జింకల వెంకటస్వామి, బద్దుల ప్రవీణ్, యువమోర్చా అసెంబ్లీ కన్వీనర్ పరుశురాం, మండల ప్రధాన కార్యదర్శి తిరుమల్, మండల మోర్చా ప్రధాన కార్యదర్శిలు మార్కండేయ, జగదీష్ కోడేరు మండల అధ్యక్షులు పుల్లయ్య , శ్రీకాంత్, నాగరాజు, మద్దిలేటి,అంజి, శ్రీను, శివ, భాను, తదితరులు పాల్గొన్నారు.