*పెద్దేముల్ లో రాజాసింగ్‌కు మద్దతుగా స్వచ్ఛంద బంద్*

పెద్దేముల్ ఆగస్టు 29 (జనం సాక్షి)
బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా సోమవారం నాడు పెద్దేముల్ మండల కేంద్రంలోని  వ్యాపారులు స్వచందంగా బంద్ పాటించారు. మండలకేంద్రంలోని దుకాణాలు మూతపడటంతో చౌరస్తా నిర్మానుష్యంగా మారింది.
హిందూ ధర్మరక్షణ కోసం పోరాడుతున్న రాజాసింగ్‌కు మద్దతు ఇచేందుకు వ్యాపారాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నట్టు వ్యాపార సంఘాలు ప్రకటించాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు బంద్ ప్రశాంతంగా కొనసాగింది.