పెళ్లి మండపం వద్దే విషం తాగిన ‘ప్రేమికుడు’

akshaya

కృష్ణగిరి: తమిళనాడు రాష్ట్రంలోని ఓ వివాహ మండపం వద్ద చోటు చేసుకున్న క్లైమాక్స్ సన్నివేశం అచ్చంగా మసాల మూవీని తలపించింది. అది కృష్ణగిరిలో ఓ కల్యాణ మండపం.  కాసేపట్లో వధూవరులు రమేశ్(25), అనిత(19) లు పెళ్లి పీటలపై కూర్చునేందుకు సిద్దమయ్యారు.పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి కావడంతో ఆ జంట వివాహ మండపం పైకి వచ్చారు.
అయితే ఇంతలోనే ఓ ట్విస్ట్. వధువును ప్రేమించానంటూ  మాదేశ్ అనే యువకుడు తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ యువతిని కిడ్నాప్ చేయడానికి యత్నించాడు. ఆ క్రమంలోనే తన వెంట తెచ్చుకున్న మంగళసూత్రాన్ని అ అమ్మాయి మెడలో కట్టబోయాడు. ఈ సంఘటన ఉలిక్కిపడిన వధువు బంధువులు ఆ యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అయినప్పటికీ అతగాడు ఏమాత్రం వెరవక తామిద్దరం ప్రేమించుకున్నామంటూ హల్ చల్ చేశాడు.ఆ అమ్మాయికి పెళ్లి జరిగితే తనతో జరగాలంటూ పట్టుబట్టాడు.
వధువు బంధువులు …పెళ్లికి నిరాకరించటంతో  ఆ యువకుడు తన వెంట తెచ్చుకున్న  విషాన్ని తాగాడు. దాంతో రమేశ్ ,అనితల వివాహం ఆగిపోయింది.  ఈ ఘటనతో పెళ్లి కొడుకు చేసుకోబోయే వధువు రీప్లేస్ అయింది.  అదే వేదికపై దివ్య (20)అనే యువతితో రమేశ్ వివాహం జరిగిపోయింది.  కాగా, అసలు పెళ్లి మండపం వద్ద హడావుడి సృష్టించిన మాదేశ్ నిజంగానే అనితను ప్రేమించాడా?అనేది మాత్రం తేలాల్సి ఉంది. . ప్రస్తుతం అతను స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.