పెషావర్‌లో ఆత్మాహుతి దాడివల్ల ఆరుగురి మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో పెషావర్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. పోలీసు వ్యాన్‌ లక్ష్యంగా అత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 40 మంది గాయాలయ్యాయి. వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.