పేదలకు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన

ఏలూరు,మే14(జ‌నం సాక్షి):  పేదల ఇళ్లకు పట్టాలు, రైతులకు వ్యవసాయ భూములు ఇవ్వలని సిపిఎం ఆందోళనకు దిగింది. ఎంతోకాలంగా వీటి కోసం ఎదురుచూస్తున్న  పేదలకు అన్యాయం చేస్తున్నారని  మండిపడింది. సిపిఎం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామస్తులు సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయలకులు తహసీల్దార్‌కి విన్నతి పత్రం అందజేశారు. సమస్యలను పరిస్కరించాలని కోరారు.