పేదవారి కష్టాలు తీర్చేది ఇందిరమ్మ ప్రభుత్వమే..

` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
` ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ
నాగర్‌ కర్నూల్‌్‌(జనంసాక్షి): ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో గిరిజన ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారన్నారు. తన కోసం రూ.2 వేల కోట్లతో హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌ నిర్మించుకున్నారని విమర్శించారు.