పోలీస్‌ అధికారి హిమాన్ష్‌ రాయ్‌ ఆత్మహత్య

ముంబై,మే11(జ‌నం సాక్షి ):  మహారాష్ట్ర యాంటీ టెర్రర్‌ స్కాడ్‌ మాజీ చీఫ్‌ హిమన్షు రాయ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసంలో గన్‌తో షూట్‌ చేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ఐపీఎస్‌ 1988 బ్యాచ్‌కు చెందిన హిమన్షు ముంబై 26/11 ఉగ్రదాడి కేసు దర్యాప్తులోనూ ప్రధాన పాత్ర పోషించారు. 2013లో జరిగిన ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసును దర్యాప్తు చేశారు. అయితే.. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగాలేక లీవ్‌లో ఉన్నారు.
హిమన్షు గత కొన్ని రోజులుగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. 2016లో మహారాష్ట్ర అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా రాయ్‌ అపాయింట్‌ అయ్యారు. రాయ్‌ కొన్ని రోజులు జాయింట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గానూ వర్క్‌ చేశారు. ఐపీఎల్‌ స్కామ్‌తో పాటు లైలా ఖాన్‌, ఆమె బంధువుల హత్య కేసునూ చేధించారు.