ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మాది కాదు

ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మాది కాదు

 జనంసాక్షి, మంథని, అక్టోబర్ 17 : నాయకులకు ప్యాకేజీ ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి మాది కాదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మంథని డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీ కి చెందిన మంథని ఎంపీపీ, ఇతర ప్రజాప్రతినిధులు ప్యాకేజీలు తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారని టిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు కొండ రవీందర్ చేసిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న నాయకులకు ఎంత ప్యాకేజీ మీరు ఇచ్చారని ప్రశ్నించారు. అలాగే వార్డ్ మెంబర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఎడ్ల మధుకర్ మాట్లాడుతూ.. కాలేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ పంట భూములు ఎన్నో ఏళ్లుగా మునిగిపోతున్న అధికార పార్టీ నాయకులు పట్టించుకోకపోవడంతో.. బ్యాక్ వాటర్ రైతుల సమస్యలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పరిష్కరిస్తారనే నమ్మకంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ మంథని మండల అధ్యక్షుడు మంథని రాకేష్, ఎస్సీ సెల్ డివిజన్ ఉపాధ్యక్షులు మంథని సమ్మయ్య, మండల అధికార ప్రతినిధి తోకల మల్లేష్, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు ఆర్ల నారాయణ, కాంగ్రెస్ నాయకులు మడిపల్లి సూర్య సాగర్ ,రోడ్డ రాజేశ్వరరావు , అక్క పాక సాదయ్య ,దారపు నితీష్, అక్క పాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.