ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి వైస్ చైర్మన్

అయిజ,ఆగస్టు 26 (జనం సాక్షి):
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిదవ వార్డు మాల పేట కాలనీలో ప్రభుత్వ డాక్టర్ రామలింగేశ్వర రెడ్డి మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రజలకు వైద్య సేవలు,
ఇట్టి కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాల నరసింహులు, మాట్లాడుతూ.
ప్రతి ఒక్కరూ
షుగరు, బిపి, కరోనా మూడవ డోస్ బూస్ట్ ఇంజక్షన్ మొదలగు వైద్య సేవలను మన వార్డులో పెట్టడం జరిగింది,
 కనుక ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలని ప్రజలకు తెలియజేసిన వైస్ చైర్మన్ మాల నరసింహులు  అన్నారు, ఇట్టి కార్యక్రమంలో
ఏఎన్ఎం కె పుష్ప ,టీ. భాగ్యమ్మ, ఆశ వర్కర్లు కే మహేశ్వరి, దేవమ్మ ,ఎన్ శివమ్మ, డి మేనక, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు