ప్రజల ఆశీస్సులతో.. మరింత ముందుకు.

ప్రజల ఆశీస్సులతో.. మరింత ముందుకు.

తాండూరు అక్టోబర్ 17(జనంసాక్షి)
ప్రజలఆదరాభిమానాలు ఆశీస్సులతో మరింత ముందుకు వెళ్తామని బిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళావర్కిం గ్ అధ్యక్షురాలు పరిమళ రవీందర్ పేర్కొన్నారు .మంగళవారం తాండూరు పట్టణం 23వ వార్డు లో పట్టణ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలుగా నియమి తులైన సందర్భంగా వార్డు ప్రజలు ఘనంగా సన్మానిస్తూ ఆశీర్వదిం చారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలు పరిమళ రవీందర్ మాట్లాడుతూ వార్డు ప్రజలతో పాటు పట్టణ ప్రజల ఆదరాభి మానాలు ఇలాగే ఉండాలని రాబోయే రోజుల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.తనకు బిఆర్ఎస్ పార్టీ పట్టణ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలుగా అవకాశం కల్పించిన మంత్రి పట్నం మహేందర్ డ్డి మరియు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి పట్టణ మహిళా వర్కింగ్ అధ్యక్షురాలుగా నియ మించినందుకు గాను శాయశక్తుల కృషిచేసి బిఆర్ఎస్ పార్టీ బలోపే తానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తమ వార్డుతో పాటు పలు వార్డులలో గడపగడప కు తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.అదేవిధంగా
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘన విజయానికి వార్డు ప్రజలతో పాటు ప్రతి ఒక్కరిని కలుపుకు పోయి విజయానికి నాంది పలుకు.తామన్నారు. ఈ కార్యక్రమంలో బోయ కవిత ,కమలమ్మ, పద్మ, శ్రీదేవి ,అనూష, సంధ్య, రాధమ్మ బి. శ్రీనివాస్, కావలి శ్రీనివాస్, వెంకటయ్య, రాములు గౌడ్ ,వెంకట్ బాలు, శ్రీధర్, శివకుమార్, భీమ్ శంకర్, వెంకటయ్య, అరుణ్ ,అనిల్ ముదిరాజ్, శ్రీనివాస్ మేస్త్రి రజాక్ కృష్ణతో పాటు వార్డు ప్రజలు తదితరులు ఉన్నారు