ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పక్కా

ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పక్కా

వనపర్తి బ్యూరో అక్టోబర్17(జనంసాక్షి)

స్వరాష్ట్ర పాలనలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా బిఆర్ ఎస్ ప్రభుత్వం గత 9 ఏండ్ల కాలంలో చేసి చూపించిందని ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రప్రమోద్ రెడ్డి అన్నారు. మంగళవారం పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు లో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలందరునియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూర్ ప్రప్రమోద్ రెడ్డి కి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని , ఇటీవల విడుదల చేసిన మ్యానిఫెస్టో అందుకు నిదర్శనం ఆయన వివరించారు . కనీవినీ ఎరుగని రీతిలో నియోజకవర్గాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగిందని మరొకసారి ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు . ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.