ప్రజల భద్రతకోసం సంస్కరణలు
పోలీస్ కవిూషనర్ విబి కమలాసన్రెడ్డి
కరీంనగర్,అక్టోబర్17(జనంసాక్షి): ప్రజల భద్రతకోసం కవిూషరేట్లో పలు సంస్కరణలు అమలు చేస్తున్నామని పోలీస్ కవిూషనర్ విబి కమలాసన్రెడ్డి పేర్కొన్నారు. పోలీస్లు చేపడుతున్న కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తున్నారన్నారు. మంగళవారం కాశ్మీర్గడ్డ, భగత్నగర్లలో పోలీస్లు కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈసందర్బంగా కాలనీవాసులతో ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కవిూషనర్ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ నగరంల స్మార్ట్ సిటీగా ప్రకటించిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలను అభివృద్దికోసం మంజూరు చేశాయన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ది సాద్యం అవుతుందన్నారు. తాజా ఆస్టేల్రియాల ప్రభుత్వం కరీంనగర్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. యువత వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు.ఉన్నత చదువులను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదన్నారు. అన్నివర్గాల ప్రజలకుఇబ్బందిగా మారిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిగా నియంత్రిస్తామన్నారు. నేరాల చేదన అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఆదునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన వసరం లేకుండా అన్నివర్గాల ప్రజలకు సౌకర్యార్థం హాక్ఐ యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పౌరుడు హాక్ఐ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. సిసి కెమెరాల ఏర్పాటుకోసం నేనుసైతం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు బాగస్వాములు కావాలన్నారు. వాహనాల కొనుగోలు సందర్బంగా వాహనదారులు తమ పేరిట వాహనాల రిజిస్టేష్రన్ చేసుకోవాలన్నారు. దొంగతనం ప్రమాదాలు జరిగిన సందర్బాల్లో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. కరీంనగర్లో త్వరలో హైదరాబాద్ తరహాలో ఈ చలాన్ విదానాన్ని అమలు చేయనున్నామన్నారు. తమ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బ్లూకోట్స్ బృందాల ఫోన్ నంబర్లు తీసుకోవాలన్నారు. ఏదైనా సంఘటన జరిగిన సందర్బం లో సమాచారం అందించినట్లయితే సంఘటనా స్థలానికి బ్లూకోట్స్ బృందాలు చేరుకుంటాయన్నారు. ఈసందర్బంగా సరైన దృవపత్రాలు లేని 53 ద్విచక్ర వాహనాలు నాలుగు ఆటోలు, ఒక కారును స్వాదీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎసిపి రామారావు, ఇన్స్పెక్టర్లు మహెశ్ గౌడ్, విజయ్కుమార్, రవి, గౌస్బాబా, ఆర్ఐ గంగాధర్, క్యూఆర్టి టాస్క్ ఫోర్స్ ఆర్మ్డ్ రిజర్వ్ విబాఆలతోపాటు 150 మంది పోలీస్లు పాల్గొన్నారు.