ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాం

ఏవో ఆజం అలీ

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) ఆగస్టు 9 : సోమవారం ప్రజావాణి ద్వారా వచ్చిన 23 పిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని ఆజం అలీ ఎ.ఓ అన్నారు.సోమవారం వివిధ సమస్యల పై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈరోజు నిర్వహించిన ప్రజావాణి ద్వారా మొత్తం 23 పిర్యాదులు వచ్చాయని, ధరణి 19 పిర్యాదులు ఇతర 4 సమస్యలకు సంబంధించినవి వచ్చాయని తెలిపారు. ప్రజావాణి ద్వారా స్వీకరించిన భూ సమస్యలు , ఆసరా పెన్షన్ మరియు ఇతర సమస్యలకు సంబంధించిన పిర్యాదులు అన్నింటిని సంబంధిత శాఖలకు పంపించి, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని పిర్యాదుదారులకు హామీ ఇచ్చారు. సమావేశంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.