ప్రజా దర్బార్ ని ఆలేరు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 5 (జనంసాక్షి)

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజల సమస్యల కోసం ప్రతీ శనివారం ప్రజా దర్బార్ ని నిర్వహిస్తున్నారు కావున నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్వి జిల్లా కో-ఆర్డినేటర్ దేవులపెళ్లి ప్రవీణ్ రెడ్డి అన్నారు మండలం కేంద్రంలో టిఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లి వివరించాలన్నారు ఈ సమావేశంలో యువజన విభాగం టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చెంతన్ రాజు టీఆర్ఎస్వి అధ్యక్షుడు చుంచు నాగరాజు ఆలేరు నియోజకవర్గ జనరల్ సెక్రెటరీ బెజ్జరబోయిన మహేష్ ఆలేరు నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నాతి మల్లికార్జున్ ఆత్మకూరు మండల్ టిఆర్ఎస్వి సెక్రెటరీ జనరల్ గజ్జెల్లి మహేష్ మండల టీఆర్ఎస్వి ఉపాధ్యక్షుడు ఎనితుల వంశీ ఆత్మకూరు మండల టిఆర్ఎస్వి కార్యదర్శి కూరేళ్ల మణికుమార్ టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బూడిద శేఖర్ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మోహన్ తదితరులు పాల్గొన్నారు