ప్రజా సమస్యల కోసమే గౌరవ స్వతంత్ర పాదయాత్ర

మల్దకల్ ఆగస్టు 13 (జనంసాక్షి) ఏఐసిసి ఆదేశాల మేరకు టీపీసీసీ ఉపాధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్వతంత్ర గౌరవ పాదయాత్ర 5వ రోజు శనివారం మల్దకల్ మండల కేంద్రం నుండి ఎద్దులగూడెం, నీలిపల్లి, ఎల్కూరు చేరుకొని వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎల్కూరు నుండి పాదయాత్ర ప్రారంభమై పాల్వాయి, పావనం పల్లి ,కొండపల్లి మీదుగా యాత్ర చేరుకుంది.ఈ పాదయాత్రలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరుబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటస్వామి గౌడ్,మల్దకల్ మండల అధ్యక్షులు నల్లారెడ్డి,గట్టు మండలం అధ్యక్షులు గౌసు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షులు సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమల్,యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జిల్లా సేవాదళ్ జనరల్ సెక్రెటరీ శివరాజ్, గద్వాల్ మండల నాయకులు రఘునాయుడు,అలెగ్జాండర్, కోటేశ్వర్ గౌడ్, రంజిత్, రఫీ,ప్రసాద్, వెంకటేష్ నాయక్,మురళి, గౌస్,ప్రసాద్, రాము, విరేష్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.