ప్రతి ఇంటింటా జాతీయ జెండాను ఎగరేద్దాం

-మాజీ ఎంపీ డాక్టర్ మంద జగన్నాథం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 10 : ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవలని పురస్కరించుకొని ఇంటింటా జాతీయ జెండాను ఎగరవేయలని తెలంగాణ రాష్ట్ర ఢిల్లీలో అధికార ప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం ప్రజలకు పిలుపు నిచ్చారు. బుధవారం మండల పరిధిలోని కోండేరు గ్రామంలో ప్రజలకు త్రివర్ణ పతకం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరంలో ఎంతోమంది మహనీయులు అమరులై స్వాదించుకున్న భారతదేశ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసేలా జాతీయ పతాకాలను ఆవిష్కరించాలన్నారు. అనంతరం సర్పంచ్ వీరన్న యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు త్రివర్ణపథకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మంద శ్రీనాథ్, పార్టీ సీనియర్ నాయకులు రామిరెడ్డి, అంజి, ఏకాంత్, ఉప సర్పంచ్ పసులన్న, బలరాముడు, కార్యదర్శి బాష, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.