ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి : కలెక్టర్ శ్రీహర్ష

జాతీయ జెండా పంపిణి కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య ,ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) ఆగస్టు 9 : జిల్లాలో ప్రతి ఒక్కరిలో జాతీయభావం పెంపొందించేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఇంటింటా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని, 75 వ భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమములో బాగంగా ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని కల్లెక్టరేట్ కార్యాలయంలో జడ్ పి చైర్మెన్ సరిత తిరుపతయ్య, జిల్లా కలెక్టర్ శ్రీహర్ష , గద్వాల శాసనసభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.
మంగళవారమ కల్లెక్టరేట్ కార్యాలయంలో భారత స్వతంత్ర వజ్రోత్సవ కార్యక్రమానికి సంబంధించి జాతీయ జెండాలు, ఫ్లెక్సిలు ప్రారంభించి జిల్లాలో ప్రతి ఇంటికి జాతీయ జెండాలు చేరేలా చూడాలని సంబందిత అధికారులకు ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండాను ఏర్పాటు చేసుకోవాలని, గ్రామ స్తాయిలో పంచాయతి సెక్రటరీ, మున్సిపాలిటి పరిది లో వార్డ్ అధికారులచే పంపిణి చేస్తునట్లు, జెండా పంపిణి సమయం లో నిబంధనలు పాటించాలని అధికారులకు ఆదేశించారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని 31 వ వార్డ్ నల్ల కుంట లో ఇంటింటికి వెళ్లి జెండాలను పంపిణి చేశారు. జిల్లాలో శ్రీనివాస్ థియేటర్ కు వెళ్లి అక్కడ పిల్లలు ఎంత మంది వచ్చారు, సినిమా అయిన తర్వాత వారికీ పండ్లు పంపిణి చేసి సురక్షితంగా వాహనాలలో తీసుకెళ్ళి వారి ఇండ్లకు చేర్చాలని జిల్లా విద్యా శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ ,జడ్ పి వైస్ చైర్మెన్ సరోజమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి రామేశ్వరమ్మ ,కే టి దొడ్డి జడ్పిటిసి రాజశేఖర్ , జాడ్ పి సి ఇ ఓ విజయ నాయక్, డి ఆర్ డి ఓ నాగేంద్రం, డి పి ఓ శ్యాం సుందర్, ఆర్ టి ఏ పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.