ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి

ఆగస్టు10(జనం సాక్షి)
తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు బారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండల పరిధిలోని తూర్పు గార్లపాడు గ్రామంలో సర్పంచ్ శేషమ్మ జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ దేశంలోని కులమతాల కతీతంగా పేద, ధనిక తేడా లేకుండా దేశ ప్రజలు ఒకే రోజు జరుపుకునే గొప్ప జాతీయ పండుగ అన్నారు. జాతీయ భావం పెంపొందించే విధంగా జరుగుతున్న ఈ వజ్రోత్సవాల్లో ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని, దేశ గొప్పతనాన్ని, ఐక్యతను చాటాలని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమైన జాతీయ జెండాఆవిష్కరణ… నేడు ప్రతి ఇంటిపై రెప రెపలాడటం గర్వించదగ్గ విషయం అన్నారు. జాతీయతను , జాతి ఐక్యతకు కృషి చేసిన అమరుల త్యాగాన్ని కుల మతాలకు అతీతంగా తలుచుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుకోవడం దేశ ప్రజలు చేసుకున్న అదృష్టమని సర్పంచ్ శేషమ్మ తెలిపారు.