ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

కామాండెంట్ బి. రామ్ ప్రకాష్

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 10 : మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో ఉన్న పదవ బెటాలియన్ లో 75 వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవాలు పురస్కరించుకొని బుధవారం కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో బెటాలియన్ ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అడవులు అంతరించి పోతుండడంతో మానవుని మనగడకు మొక్కలే జీవన ఆధారమన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సి హెచ్ సాంబశివరావు, ఆర్ఐలు వి. శ్రీధర్, వి.రమేష్ బాబుతో పాటు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.