ప్రతి పౌరుడు సైనికుడిలా పోరాడుతున్నారు: ప్రధాని మోదీ
` మన్కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోదీ
దిల్లీ,ఏప్రిల్ 26(జనంసాక్షి):ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మన్కీ బాత్లో మాట్లాడారు. కరోనా వైరస్పై భారత్లో జరుగుతున్నది ప్రజాపోరాటం అన్నారు. ప్రజు, ప్రభుత్వాధికాయి కలిసికట్టుగా వైరస్పై పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక పౌరుడు.. సైనికుడిలా వైరస్ఫై యుద్ధం చేస్తున్నారన్నారు. కరోనా సంక్షోభ వేళ రైతు మాత్రం నిర్విరామంగా పనిచేస్తున్నారన్నారు. ఎవరు కూడా ఆకలితో అమటించకుండా ఉండేందుకు రైతు శ్రమిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వారి వారి సామర్థ్యానికి తగినట్లు పోరాడుతున్నారన్నారు. కొందరు ఇంటి కిరాయిను మాఫీ చేస్తున్నారని, క్వారెంటైన్లో ఉన్న వాళ్లు స్కూళ్లకు రంగు అద్దుతున్నారన్నారు. కోవిడ్ వారియర్స్ అనే డిజిటల్ ఫ్లాట్ఫామ్ను క్రియేట్ చేశామని, ఎన్జీవోు, స్థానిక ప్రభుత్వాు దాంట్లో భాగమైనట్లు చెప్పారు. డాక్టర్లు, నర్సు, ఎన్సీసీ క్యాడెట్లు కూడా దాంట్లో జతకలిశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాు, ప్రతి శాఖ, సంస్థు అన్నీ.. వీలైనంత త్వరగా కోుకునేందుకు కలిసి పనిచేస్తున్నాయన్నారు.