ప్రత్యేక ¬దాపై కేంద్రం నిరాశపరిచింది: వైకాపా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆంధప్రదేశ్ రాష్టాన్రికి ప్రత్యేక ¬దా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరాశ పరిచిందని వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అసలు ఏపీకి ప్రత్యేక ¬దా రాకపోవడానికి కారణం టీడీపీ, బీజేపీలేనని ఆయన మండిపడ్డారు. ఉపాధి హావిూ పథకానికి నిధుల కేటాయింపు పెంచడం మాత్రం హర్షణీయమన్నారు.రైతుల కోణంలో నుంచి ఇది నిరాశాజనకమైన బడ్జెట్ అని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. పంటబీమా, గిట్టుబాటు ధరల అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కలేదని ఆయన అన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇవ్వకపోవడం అత్యంత నిరాశపరిచే అంశమని అవినాష్ రెడ్డి అన్నారు. ఇక పేదరిక నిర్మూలనకు కేంద్రం ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేవిూ లేవని మరో ఎంపీ వరప్రసాద్ అన్నారు.