ప్రధానితో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ : దేశ రాజధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చించినట్లు తెలిసింది. అంతకుముందు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో సమావేశమై సుమారు అరగంట చర్చించారు.