ప్రధాని ప్రకటనకు కాంగ్రెస్ డిమాండ్, రాజ్యసభ వాయిదా

RAJYASABHA-4-PM001

అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయాలంటూ కాంగ్రెస్‌ పట్టుబట్టడంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. అంతకు ముందు.. అగస్టా వెస్ట్‌ ల్యాండ్‌ స్కాంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ ప్రధాని మోడీ, రక్షణమంత్రి పారికర్‌ పై ప్రివిలైజ్‌ మోషన్‌ కు అనుమతివ్వాలని కాంగ్రెస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌ లోకి దూసుకెళ్లి నినాదాలు చేయడంతో డిప్యూటీ ఛైర్మన్‌ సభను వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత ఆర్థిక బిల్లుపై చర్చించాలంటూ కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్‌ నఖ్వీ ప్రకటన చేశారు. ఐనా, కాంగ్రెస్‌ పట్టువీడక పోవడంతో సభ రేపటికి వాయిదా పడింది.