ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఎన్నిక.

అధ్యక్షులు గా హరికృష్ణ ముదిరాజ్,
ప్రధాన కార్యదర్శి గా దాసరి కృష్ణ తేజ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్28(జనంసాక్షి):

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం మంగళవారం సాయంత్రం కళాశాల ప్రిన్సిపాల్ షాజహాన్ సుల్తానా సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు గా హరికృష్ణ ముదిరాజ్,
ఉపాధ్యక్షులుగా కావలి కృష్ణ ముదిరాజ్,
ప్రధాన కార్యదర్శి గా దాసరి కృష్ణ తేజ,
సహాయ కార్యదర్శి గా రామ్మోహన్, కోశాధికారి గా జానకిరామ్,కమిటీ ప్రధాన సభ్యులు గా వాజిద్,కమిటీ ప్రధాన సభ్యులు గా వరుణ్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాల ఆవరణలో సమావేశాన్ని నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు.అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థుల సంఘం నుండి కృషి చేస్తామన్నారు కళాశాల మౌలిక వసతుల కల్పనకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఎంపీ, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ, ఇతర ప్రభుత్వ అధికారుల చొరవతో పరిష్కరిస్తామన్నారు.కళాశాల అభివృద్ధి కోసం ఉన్నత విద్య బలోపేతం కోసం పూర్వ విద్యార్థుల సంఘం ఉపయోగ పడుతుంద ని అన్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ అధ్యక్ష కార్యదర్శులను మరియు కమిటీ సభ్యులందరినీ కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బంది సమక్షంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల లైబ్రేరియన్ శ్రీనివాసులు కళాశాల అధ్యాపకులు కోదండరాములు తదితరులు పాల్గొన్నారు.