ప్రవసం కోసం ఆస్పత్రిలో చేరిన భార్య

గుండెపోటుతో భర్త మృతి
న్యూయార్క్‌లో ఘటన
అమెరికాలోని న్యూయార్క్‌లో వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం ఓగ్లాపూర్‌కు చెందిన క్రాంతికుమార్‌ ఆదివారం గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన భార్య వాణి ప్రసవం కోసం స్థానిక ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే క్రాంతి మృత్యువాతపడ్డాడు. దిక్కుతోచని స్థితి వాణి ఆస్పత్రిలో ఒంటిరిగా ఉంది. క్రాంతికుమార్‌ న్యూయార్క్‌లోని ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే నివాసముంటున్నాడు. క్రాంతి మరణవార్త తెలుసుకొని ఓగ్లాపూర్‌లోని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రిలో ఉన్న అతడి భార్యకు వైద్య సహాయం అందించాలని వేడుకుంటున్నారు.