ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ ప్రాథమిక పరీక్ష,

91.88% హాజరు శాతం నమోదు.
468 మంది పరీక్షకు గైర్ హాజరు
పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా యస్.పి.  యం.  రమణ కుమార్
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ ప్రాథమిక పరీక్ష, అన్ని పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా యస్.పి. శ్రీ యం.  రమణ కుమార్
91.88% హాజరు శాతం నమోదు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన ఎస్.ఐ ప్రాథమిక పరీక్ష, అన్ని పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా యస్.పి. శ్రీ యం.  రమణ కుమార్
91.88% హాజరు శాతం నమోదు.
 జిల్లా వ్యాప్తంగా జరిగిన ఎస్.ఐ ప్రాథమిక పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేయించడంతో పాటు, స్వయంగా యస్.పి.  పర్యవేక్షించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా లో మొత్తం 10  పరీక్షా కేంద్రాలలో 5766 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 5298 మంది పరీక్ష కు హాజరయ్యారని, 468 మంది పరీక్షకు గైర్ హాజరు అయ్యారన్నారు.
అన్ని పరీక్ష కేంద్రాలలో అభ్యర్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయడం జరిగిందన్నారు. అక్కడక్కడా బయోమెట్రిక్  సమస్యలు తలెత్తగా పోలీసు సిబ్బంది వెంటనే పింగర్ ప్రింట్ విధానం ద్వారా సమస్య పరిస్కరించడం జరిగిందన్నారు. అంతేకాకుండా జె.న్.టి.యు. పరీక్ష కేంద్రంలో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన  ఇద్దరు అభ్యర్ధులపై కేసు కూడా నమెదు చేయడం జరిగిందన్నారు.
ఈ  పరీక్ష కేంద్రాలను సందర్శించిన సమయంలో యస్.పి. , నోడల్ అధికారిగా జహీరాబాద్ డి.యస్.పి. వి. రఘు పాల్గొన్నారు