ప్రస్తావన లేని ప్రత్యేక ¬దా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి28 : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ¬దాకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి హావిూదక్కలేదు. అయితే సహాయ నిధి మాత్రమే ఉంటుంది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లి బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం స్పష్టం అయింది. ఎపికి ప్రత్యేక ¬దా గురించి ఆయన ప్రస్తావించలేదు. ఎవరిని ప్రత్యేక కేటగిరిగా ప్రకటించడం లేదని అంటూ, పశ్చిమబెంగాల్, బీహార్ లకు కూడా ఎపి తరహాలో సహాయ నిధి ఏర్పాటు అవుతుందని అన్నారు. విభజన కు ముందు రాజ్యసభలో ఎపికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఆనాటి విపక్ష నేతగా అరుణ్ జైట్లి, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు పట్టుబట్టారు.కాని ఇప్పుడు ఆ విషయంలో జైట్లి వెనక్కి వెళ్లిపోయినట్లే కనిపిస్తోంది. అయితే ఆర్దిక సాయం చేస్తామని అంటున్నారు.