ఫిలిప్పీన్స్‌లో భూకంపం

మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 5.7గా నమోదైంది. భూప్రకంపనలతో కర్మెస్‌ ప్రాంతంలోని రెండు గ్రామాల్లో కొండ చరియలు విరిగిపడటంతో 8 మంది చిన్నారులు గాయపడ్డారరు. కిమద్‌జిల్‌ గ్రామంలో వంతెనతోపాటు నాలుగు పాఠశాల భవనాలు కూలిపోయాయి.