ఫోటో రైట్ అప్: మాట్లాడుతున్న మునిగల రమేష్

సిపిఎం  క్లాసులను జయప్రదం చేయాలి
… సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్
స్టేషన్ ఘనపూర్, ఆగస్టు 27, ( జనం సాక్షి ) :
ఈనెల 29 ,30 తేదీలలో సిపిఎం స్టేషన్ ఘన్పూర్ మండల శాఖ కార్యదర్శిలు,పార్టీ సభ్యులకు నిర్వ హించు క్లాసులను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీమండలకార్యదర్శి మునిగెలరమేష్ అన్నారు. డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ మా ట్లాడుతూ ఈనెల29,30తేదీలలో సిపిఎంమండల స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న ట్టు తెలిపారు. ఈ శిక్షణ తరగతులలో ప్రస్తుత దేశ,రాష్ట్ర పరిస్థితులను,సామాజిక అంశాలను ప్రజాపోరాటాలు ఎలాముందుకు తీసుకు వెళ్ళాలి అనే అంశాలతో క్లాసులు ఉంటాయని అన్నారు. ఈ శిక్షన తరగతులకు పార్టీసభ్యులు అధికసంఖ్య లో హాజరై జయప్రదం చేయాలనికోరారు.ఈకార్య క్రమంలో మండల కమిటీ సభ్యులు చిలుముల్ల భాస్కర్,శివునిపళ్లి గ్రామపార్టీకార్యదర్శి ఇనుగాల పెద్దిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.