ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న డీజీపీ…

ఢిల్లీ:ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ఏపీ డీజీపీ రాముడు కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు. ఏపీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావుతో కలిసి డీజీపీ ఢిల్లీ వెళ్లారు. సీఎస్‌ కృష్ణారావు కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ, హోం శాఖ కార్యదర్శితో భేటీ అయి విభజన బిల్లులోని లోపాలను వివరించనున్నారు.