ఫ్రంట్ ఏర్పాటు వార్తలు అవాస్తవం:కెకె
హైద్రాబాద్: పార్టీలకతీతంగా తెలంగాణకోసం పోరాడుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆయన టీఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని చెప్పారు. తెలంగాణ ఇవ్వను అని అధిష్టానం చెబితే అపుడు ఆలోచిస్తామన్నారు.