* ఫ్రీడం రన్ ను విజయవంతం

జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆధ్వర్యంలో

* పోలీస్ శాఖ ఆధ్వర్యంలో
నిర్వహించిన 2k ఫ్రీడం రన్ లో పెద్ద సంఖ్యలో ప్రముఖులు

గద్వాల ఆర్ సి(జనంసాక్షి) ఆగస్ట్ 11,
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 6 గంటలకు గద్వాలలోని వైఎస్సార్ చౌరస్తాలో ప్రారంభించే ఫ్రీడం రన్ ను పట్టణ ప్రజలు అందరూ పాల్గొని జాతీయ భావాన్ని స్ఫురింప చేసేలా విజయ వంతం చేశారు. ఈ ఫ్రీడం రన్ ను పాత బస్టాండ్ నుండి ప్రారంభమై కృష్ణవేణి చౌరస్తా, ప్రభుత్వ ఆసుపత్రి రాజీవ్ మార్గ్ ,మార్గం మీదుగా కొనసాగి ,వైఎస్సార్ చౌరస్తా వద్ద ముగిసింది.జాతీయ సమైక్యతను చాటే ఈ రన్ లో విద్యార్థులు, రాజకీయనేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు వివిధ మత పెద్దలు సంఘాలు ప్రభుత్వ పాఠశాల యాజ మాన్యం అన్ని వర్గాల వారు పాల్గొని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ,ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, వార్డు కౌన్సిలర్లు, వివిధ సంఘాల నాయకులు ,జిల్లా ఎస్పి రంజన్ రతన్ కుమార్, డీ ఎస్పి , ఎస్సై సీఐ లో వివిధ వర్గాల వారు పాల్గొని విజయవంతం చేశారు.