ఫ్లడ్ రిలీఫ్ స్కాంపై విచారణ – హరీష్ రావత్..

డెహ్రాడ్రూన్ : ప్రభుత్వ అధికారులు సమర్పించిన ఫోర్జరీ బిల్లులపై విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ పేర్కొన్నారు. బాధ్యాతరహితంగా వ్యవహరించిన వారిపై చర్యలు ఉంటాయని ఆయన ప్రకటించారు. రెండేళ్ల క్రితం సంభవించిన వరదల సమయంలో జరిగిన సహాయ కార్యక్రమాల సందర్భంగా ప్రభుత్వ అధికారులు బిల్లులు సమర్పించే సమయంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆర్టీఐ పిటిషన్ ఒకరు సంబంధిత పత్రాలనుఅం దచేయడంతో రాష్ట్ర సమాచార కమిషనర్ అనీల్ శర్మ విచారణకు నిర్వహించారు. దీనితో ఈ కుంభోకణం వెలుగులోకి వచ్చింది.