బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింస

ఢాకా: బంగ్లాదేశ్‌లో హింస కొనసాగుతోంది. జమాతే ఇస్లామీ నేత దిలావర్‌ హుస్సేన్‌ సయ్యదీకి మరణ శిక్ష విధింపుతో చేలరేగిన అల్లర్లలో ఇప్పిటివరకూ 76 మంది మృతి చెందారు. ఘర్షణల్లో ఆదివారం ఒక్క రోజే 21 మంది చనిపోవడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించారు. రాజధాని ఢాకాలో పది వేల మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు హింసాత్మక ఘటనలపై ఐక్యరాజ్యసమితి సహా అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. బంగ్లా ప్రజలు శాంతంగా ఉండాలని కోరాయి.