బంగ్లాదేశ్‌ ఘటనలో 140కి చేరిన మృతుల సంఖ్య

ఢాకా : బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా శివారులోని సవార్‌ ప్రాంతంలో నిన్న ఎనిమిది అంతస్తుల వాణిజ్య భవన సముదాయం కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ 140 మంది మృతి చెందినట్లు సమాచారం. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న ఆర్మీ అధికారి మహమ్మద్‌ సిద్ధిఖల్‌ తెలిపారు.