బంగ్లా పాడు గుత్తి కోయల గూడెంలో వైద్య శిబిరం

వెంకటాపూర్ (రామప్ప) జనం సాక్షి : మండలంలోని నారాయణపూర్ గ్రామపంచాయతీ పరిధి లోని శివారు అడవి ప్రాంతంలో బండ్లపాడులో ఉన్న గుత్తి కోయాల గూడెంలో శుక్రవారం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు డాక్టర్ పార్వతి 40 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు కలుషిత ఆహారం తినకుండా సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు ఎవరైనా అనారోగ్యానికి గురైతే స్థానిక ఏఎన్ఎం ద్వారా చికిత్స తీసుకోవాలని సూచించారు  కార్యక్రమంలో సిహెచ్ఓ సదానందం స్టాఫ్ నర్స్ జ్యోతి ఏఎన్ఎంలు రంగారెడ్డి శోభారాణి నిరోషా ఎల్టి కృష్ణ ఆశా కార్యకర్తలు కవిత ,పూర్ణ, శ్రీమతి, మాధవి తదితరులు పాల్గొన్నారు