బండి సంజయ్ ని కలిసిన జయశ్రీ పటేల్.

తాండూరు అగస్టు 7(జనంసాక్షి)
యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని తెలంగాణ రాష్ట్ర తాండూర్ నియోజకవర్గం నాయకురాలు పటేల్ జయశ్రీ దర్శించుకొని
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం 3వ ప్రజాసంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ని తెలంగాణ రాష్ట్ర తాండూర్ నియోజకవర్గం నాయకురాలు పటేల్ జయశ్రీ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానం చేశారు. భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని సూచించారని తెలిపారు. తెలంగాణ గడ్డపై భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ యాత్రలో యువనాయకులు మధు మోదీ, తాండ్ర నరేష్, శ్రీశైలం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.