బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎంపీపీ

మల్దకల్ సెప్టెంబర్ 27 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దాసరపల్లి గ్రామంలో మంగళవారం బతుకమ్మ చీరలను ఎంపీపీ రాజారెడ్డి ఆడపడుచులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ వై.రాజారెడ్డి, సర్పంచ్ భరత్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికై కృషిచేసే ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు.తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన బతుకమ్మ పండుగను గ్రామ గ్రామాన ప్రతి ఆడపడుచు పాల్గొని ఘనంగా జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ భీముడు,సింగిల్ విండో డైరెక్టర్ గూటం పాగుంటున్న,రేషన్ డీలర్ విజయ్ భాస్కర్ రెడ్డి,టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.