బస్టాండ్‌లో ఆడ శిశువును వదిలివెళ్లిన తల్లి

కాజీపేట: వరంగల్‌ జిల్లా కాజీపేట బస్టాండు సమీపంలో ఈ రోజు ఉదయం మూడు రోజుల ఆడ శిశువును తల్లి వదిలివెళ్లింది. ఈ సంఘటనాస్థలానికి చేరుకున్న 108 సిబ్బంది శిశువును చికిత్స నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు.