బస్తీ దవాఖానను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట బ్యూరో, సెప్టెంబర్29(జనంసాక్షి):
పేద ప్రజలు బస్తీ దవాఖానను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు.
 సిద్దిపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం బస్తీ దవాఖానను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సహయం అందించేందుకు పలు వార్డుల్లో బస్దీ దవాఖానను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, డీఎంఆండ్‌హెచ్‌వో డాక్టర్‌ కాశీనాథ్‌, వార్డు కౌన్సిలర్‌ తాడూరి సాయి తదితరులు పాల్గొన్నారు.