బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి

న్యూఢిల్లీ: అనంతపురం జిల్లా ఘోర బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు మోదీ సానుభూతి తెలియజేశారు. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేసింది. ప్రమాదంలో గాయపడ్డ వారు తొందరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా పెనుకొండ-మడకశిర రహదారిలో బస్సు లోయలోకి పడటంతో 16 మంది మరణించగా, మరో 40 మంది గాయపడ్డారు.