బహుజన రాజ్యాధికారం సాదిద్దాం.

బహుజన రాజ్యాధికార యాత్రను జయప్రదం చేయాలి.
బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా కన్వీనర్ అరవింద్ చారి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(జనంసాక్షి):

బహుజన రాజ్యం సాధించాలని ఆ దిశగా బహుజనులందరూ కృషి చేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి పిలుపునిచ్చా రు.శనివారం బహుజన నిర్మాణ సమితి (బిఎన్ఎస్) పార్టీ జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలంలో చేపట్టిన బహుజన రాజ్యాధికార యాత్రలో బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి పాల్గొని యాత్ర కు మద్దతు తెలపడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 2500 సంవత్సరాల నుండి ఈ దేశం కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే పరిపాలించ బడుతుందని అన్నారు..75 ఏళ్ల స్వాతంత్రం అనంతరం కూడా ఈ దేశంలో ఎలాంటి మార్పు జరగలేదని,బీసీలు రాజ్యాధికారం లేక విద్యా,ఉద్యోగ,ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లు లేక ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.జనాభా దామాషా ప్రకారం మేము ఎంతో మాకు అంత వాటా అనే నినాదంతో బహుజన నిర్మాణ సమితి పార్టీ వ్యవస్థాపకుడు ముద్దం శ్రీనివాస్ యాదవ్ ను జడ్చర్ల నియోజకవర్గం ప్రజలు ఆశీర్వదించి ఎమ్మెల్యేను చేయాలని అలాగే బహుజన రాజ్యాధికార యాత్రను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రఘు గౌడ్, సమీర్, రాము,అనిల్, యాదగిరి,లక్ష్మణ్, నిరంజన్,రంజిత్, శైలజ కళాబృందం తదితరులు పాల్గొన్నారు.