బాంబు పేలుడులో పోలీసులకు గాయాలు
రాయ్పూర్,ఫిబ్రవరి20 ( జనంసాక్షి)
: భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలడంతో కూబింగ్ చేస్తున్న పోలీసు సిబ్బందిలో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగలూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. కూంబింగ్ కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో గిరిజనుల బతుకులు చిద్రం చేస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసిస్తూ ఛత్తీస్గడ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధప్రదేశ్ రాష్టాల్ల్రో మావోయిస్టులు ఒకరోజు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.