బాగ్దాద్‌లో పేలుళ్లు: 13 మంది మృతి

బాగ్దాద్‌,(జనంసాక్షి:) ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. ఇవాళ రాజధానిలో జరిగిన వేర్వేరు బాంబు పేలుడు ఘటనల్లో పదమూడు మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక వర్గాన్ని అక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని భద్రతా సిబ్బంది తెలిపారు.