*బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం*

అలంపూర్ జనంసాక్షి (సెప్టెంబర్ 28)
అలంపూర్ మున్సిపాల్టీ లోని సంతోష్ నగర్ కు చెందిన మున్సిపలటీ లోపనిచేస్తున్న  తిరుపాల్  ఈ నెల 17 వ తారీకున హార్ట్ ఎటాక్ రావడముతో మరణించారు.విషయం తెలుసు కున్న ఎమ్మెల్యే అబ్రహం బుధవారం ఆయన ఇంటికి వెళ్ళిఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి  కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈసందర్బంగా మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరుపున అన్ని విధాలుగా ఆదుకుంటాం అని తెలిపారు. అలాగే తిరుపాలు స్థానంలో మున్సిపాలిటీలో  అయన కొడుకును నియమించుకోవాలని, అలాగే ఆమెకు వితంతు పెన్షన్ కు అప్లై చేయించలాని స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.మనోరమ ని మరియు అధికారులను  ఆదేశించారు.
ఎమ్మెల్యే  వెంట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి.మనోరమ ,టౌన్ అధ్యక్షుడు వెంకట్రామయ్య సెట్టి ,మాజీ ఎంపీపీ సుదర్శన్ గౌడ్ ,మండల ఉప అధ్యక్షడు నర్శన్ గౌడ్ , కౌన్సిలర్లు లక్ష్మి దేవామ్మ ,పెద్ద ముక్తార్ ,కో ఆప్షన్ మెంబర్ అల్ల భాకాస్ ,బతుకాయ్యా ,మాజీ టెంపుల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ,సారయి నాగరాజు ,వెంకటస్వామి ,చిన్న కృష్ణ ,దండోరా మద్దిలేటి ,వలి,దేవరాజు , జాను ,శ్రీనివాసులు ,శేకర్  ఫాయజు ,రాజేష్ ,రాముడు,రహమత్ ,బిచల్లు , మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు..