బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి

మర్పల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) మర్పల్లి మండల పరిధిలోని బిల్కల్ గ్రామంలో ఎంపీటీసీ భర్త నర్సింలు గుండె చికిత్స చేసుకొని ఇంటికి వచ్చారు. మరియు అదే గ్రామానికి చెందిన ఈసీ విట్టల్ కుమారుడు రోడ్డు ప్రమాదం గాయపడ్డాడు. విషయం తెలుసుకొని ఆదివారం రోజున వారి కుటుంబానికి వెళ్లి వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి. వారి వెంటా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి, ఎంపీపీ బట్టు లలితరమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రమేశ్వర్, సొసైటీ వైస్ చైర్మన్ పసియుద్దీన్, సురేష్, మార్కెట్ కమిటీ డైరక్టర్ రవి, టిఆర్ఎస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు సురేష్ కుమార్, సర్పంచులు ధరమ్ సింగ్, నాయకులు బట్టు రమేష్, శంకర్, ఉగ్గెల్లి రవీందర్ రెడ్డి, రతన్, సుధాకర్, శేఖర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంజిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..