*బాధిత కుటుంబాలను పరామర్శించిన గండ్ర.

 చిట్యాల20 (జనంసాక్షి) ఇటీవల వివిధ కారణాలతో మృతి చెందిన మృతుల కుటుంబాలను మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గండ్ర సత్యనారాయణ రావు పరామర్శించి తమ సంతాపం తెలిపారు. మండలంలోని ఒడితల గ్రామంలో మాచర్ల ప్రమీల ,బావుసింగ్ పల్లె గ్రామంలోని కుమ్మరికుంట్ల తిరుపతి, చిట్యాల టౌన్ లో అల్లం వెంకటనర్సు కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపాన్ని తెలిపారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి నాయకులు నందరాజు నాయక్ , శ్రీనివాస్ నాయక్ , రాజకుమార్ , రవీందర్ ,  భగవాన్, శ్రీకాంత్, శంకర్, రమేష్, వీరేందర్, తదితరులు ఉన్నారు..