బాబా రామ్దేవ్ ఫొటో మార్ఫింగ్… నిందితుడు అరెస్టు
దాద్రీ(జనం సాక్షి ): ఉత్తరప్రదేశ్లోని దాద్రికి చెందిన రయీసుద్దీన్ తన వాట్సప్ గ్రూపులో బాబా రామ్దేవ్ మార్ఫింగ్ ఫొటో పోస్టు చేశారు. దీంతో అతని వాట్సప్ గ్రూపులోని ఇతర సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా దాద్రీ సీఓ నిషాంక్ శర్మ మాట్లాడుతూ అరెస్టయిన రయీసుద్దీన్ యోగా గురువు బాబా రామ్దేవ్ ఫొటో మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడన్నారు. సమాచారం అందిన వెంటనే అతడిని అరెస్టు చేశామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.