బాబుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌

4
హైదరాబాద్‌ అక్టోబర్‌17(జనంసాక్షి):

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు…ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.  ఆదివారం సాయంత్రం 5.30 గంటలకురి చంద్రబాబుకు

కేసీఆర్‌తో అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. ఏపీ రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానపత్రం స్వయంగా అందించేందుకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కావాలని

చంద్రబాబు నాయుడు కోరిన విషయం తెలిసిందే.ఈ మేరకు తెలంగాణ సీఎం కార్యాలయానికి ఏపీ సీఎం కార్యాలయం సిబ్బంది ఫోన్‌ చేశారు. ఆదివారం సాయంత్రం తమకు కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ కావాలని సిబ్బంది కోరారు. రాజధాని శంకుస్థాపనకు కేసీఆర్‌ను ఆహ్వానిం చేందుకు తాను స్వయంగా వెళ్తానని చంద్రబాబు ఇంతకుముందు చెప్పిన విషయం విదితమే.